సెప్టెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల(రూ.300)ను రేపు టీటీడీ విడుదల చేయనుంది. ఎల్లుండి సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాతో పాటు వర్చువల్ సేవా టికెట్లు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ కోటా చెందిన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. అలాగే ఈ రోజు(బుధవారం) ఉదయం 9 గంటలకు 12, 15,17 తేదీల రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.