Censor Talk: ‘సర్కారు వారి పాట’ సెన్సార్ టాక్ ఇదే!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట'.

  • Written By:
  • Updated On - May 9, 2022 / 01:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు పరశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 12న విడుదల కానుంది. అయితే రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ‘సర్కారు వారి పాట’ సినిమా యు/ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న మహేష్ మూవీకి సంబంధించి ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది. టాక్ పూర్తిగా రివీల్ చేయకపోయినప్పటికీ, డబ్బు విషయంలో ఫుల్ స్ట్రిక్ట్ గా ఉండే హీరో… ఫస్టాఫ్ లో హీరోయిన్ తో లవ్ స్టొరీతో నడిపేస్తాడని తెలిసింది.

ఆ తర్వాత ఓ ఆసక్తి కరమైన పాయింట్ తో సెకెండ్ హాఫ్ యాక్షన్ మోడ్ లోకి వెళ్తుందట. సెకండ్ హాఫ్ లో హీరో ఓ సమస్యను ఫేస్ చేయాల్సి రాగా… ఆ ప్రాబ్లం ను సూపర్ స్టార్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ఓవరాల్ గా సినిమా స్టొరీ అంటున్నారు. ఫస్టాఫ్ కథ కామెడీ అండ్ లవ్ స్టొరీతో నిండిపోవడంతో పాటు, ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో ఆకట్టుకుంటుందని… ప్రధామార్ధం ఎబో యావరేజ్ రేంజ్ లో మెప్పిస్తుందని అంటున్నారు. ఇక ద్వితీయార్థంలో స్టొరీ కొంచం రొటీన్ గా అనిపించే అవకాశం ఉంటుందని, ఓవరాల్ గా సెకెండ్ హాఫ్ కూడా కొంచం రొటీన్ అయినా పర్వాలేదు అనిపిస్తుందని టాక్.

మొత్తం మీద సినిమా మరీ అద్బుతం కాదు కానీ, ఈజీగా ఎబో యావరేజ్ రేంజ్ లో ఉంటుందని సెన్సార్ టాక్ . సినిమాలో ఉన్న యాక్షన్, లవ్ అండ్ కామెడీకి ప్రేక్షకులు కనెక్ట్ అయితే మాత్రం.. సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మొత్తంమీద మహేష్ ‘సర్కారు వారి పాట’ కి సెన్సార్ నుండి ఫస్ట్ టాక్ ఎబో యావరేజ్ రేంజ్ లో వినిపిస్తోంది. ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మహేష్ అభిమానులు. మరి వారి అంచనాలను అందుకుంటుందా… లేదా.. అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి.