Rohit Sharma: ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) IPL 2025లో జట్టులో భాగమవుతాడా లేదా అనే దానిపై చర్చ ప్రారంభమైంది. గత సీజన్లో ముంబై కెప్టెన్సీ నుంచి రోహిత్ను తొలగించి హార్దిక్ పాండ్యాను జట్టుకు కొత్త కెప్టెన్గా నియమించింది. అయితే ఫ్రాంచైజీ ఈ నిర్ణయం సరైనదని నిరూపించబడలేదు. జట్టు ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఫలితంగా ముంబై జట్టు చివరి స్థానంలో నిలిచింది. మరోవైపు రోహిత్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ టైటిల్ను భారత్ గెలుచుకుంది. కాబట్టి రోహిత్ వేలంలోకి వస్తే చాలా ఫ్రాంచైజీలు అతనిని వేలం వేయవచ్చు. రాబోయే సీజన్కు ముందే రోహిత్ ముంబైకి వెళ్లే అవకాశం లేదని ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.
బీసీసీఐ రిటెన్షన్ నిబంధనలను ప్రకటించిన తర్వాతే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్తో కొనసాగడంపై నిర్ణయం వెల్లడి అవుతుంది. ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో.. “అతను ముంబై ఇండియన్స్తో ఉంటాడా లేదా వెళ్తాడా? అనేది పెద్ద ప్రశ్న. రోహిత్ ముంబైలో ఉండడు అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. రోహిత్ శర్మ తనంతట తానుగా వెళ్లిపోతాడని నేను భావిస్తున్నాను లేదా MI అతనిని విడిచిపెట్టవచ్చని అనుకుంటున్నాని ఆశాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.
Also Read: World’s Fastest Car: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కారు ఇదే.. ధర అక్షరాల రూ. 23 కోట్లు..!
ఏదైనా జరగొచ్చు కానీ రోహిత్ని రిటైన్ చేస్తారని నేను అనుకోవడం లేదు. నా దగ్గర ఎలాంటి సమాచారం లేదు. కానీ అతను విడుదల అవుతాడని నేను భావిస్తున్నాను. అతను ట్రేడ్ విండోలో మరొకరికి వెళ్ళవచ్చు. వేలంపాటకు వెళ్లకపోయే అవకాశం ఉంది. కానీ ట్రేడ్ విండో జరగకపోతే వేలంలో కనిపించవచ్చు. ముంబై ఇండియన్స్తో అతని ప్రయాణం ముగిసిందని నేను భావిస్తున్నాను చోప్రా తన జోస్యం చెప్పాడు. మరీ రోహిత్ శర్మ ముంబైత్ ఉంటాడో లేదా వేరే జట్టుకు వెళ్తాడో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే చోప్రా వ్యాఖ్యలపై అటు ముంబై జట్టు నుంచి ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.