Site icon HashtagU Telugu

4 Killed : యూపీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ట్రాక్ట‌ర్‌, కారు ఢీ.. న‌లుగురు మృతి

road accident

road accident

యూపీలోని మథురలో ట్రాక్టర్ ట్రాలీ, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు యాత్రికులు మృతి చెందగా, మ‌రో 16 మంది గాయపడ్డారు. మథురలోని ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారిపై ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఫరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 11.30 గంటలకు రెండు వాహనాల్లోని యాత్రికులు గోవర్ధన్ పరిక్రమ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్తాండ్ ప్రకాష్ సింగ్ తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి కారు ఢీకొని బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు, ట్రాలీలోని ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని, మృతులను గుర్తించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.