తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శబరిమల నుండి తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తుల వాహనం లోయలో పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం శుక్రవారం అర్థరాత్రి జరిగినట్లు జిల్లా కలెక్టర్ కేవీ మురళీధరన్ తెలిపారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారు. కొండ మార్గంలో మలుపు తిరుగుతుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు.