Road Accident : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు లారీలు ఢీ

గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది.

  • Written By:
  • Publish Date - August 5, 2022 / 09:56 AM IST

గుంటూరు కర్నూలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ సంఘటన తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. వినుకొండ మండలం రామిరెడ్డి పాలెం వద్ద ఎదురెదురుగా వ‌స్తున్న రెండు లారీలు ఢీకొట్టుకున్నాయి. వినుకొండ నుండి కర్నూలు వైపు వెళుతున్న నవత ట్రాన్స్ పోర్ట్ లారీ, వినుకొండ వస్తున్న అశోక్ లేలాండ్ మినీ లారీ ఢీ కొట్టుకోవ‌డంతో నవత ట్రాన్స్ పోర్ట్ లారీ తిరగబడి డ్రైవర్ మృతి చెందాడు. గాయపడిన మినీ లారీలో వారిని స్థానికులు వినుకొండ వైద్యశాలకు తరలించారు.సమాచారం తెలుసుకున్న వినుకొండ పట్టణ ఎస్సై చెన్నకేశవులు సంఘటన స్థలాన్ని చేరుకొని ట్రాఫిక్కుకు ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. నవత ట్రాన్స్పోర్ట్ లారీ డ్రైవర్ కృష్ణా జిల్లా వాసి ముక్కామల కృష్ణారావుగా పోలీసులు గుర్తించారు.