Road Accident : థానేలో ఘోర ప్ర‌మాదం.. షిర్డీకి న‌డిచి వెళ్తున్న భ‌క్తుల‌ను ఢీకొట్టిన వాహ‌నం

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని షాహాపూర్‌లో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి

Published By: HashtagU Telugu Desk
Mexico Bus Crash

Road accident

మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. థానే జిల్లాలోని షాహాపూర్‌లో షిర్డీలోని సాయిబాబా ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు భక్తులను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వారు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. శనివారం అర్థరాత్రి కలాంబే గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే ప‌నిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన భక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించామని.. అక్కడ వారు చికిత్స పొందుతున్నారని..వారి పరిస్థితి మెరుగుప‌డుతుంద‌ని పోలీసులు తెలిపారు.

  Last Updated: 12 Dec 2022, 06:54 AM IST