మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురు బాధితులు నటేరన్ బ్లాక్లోని రాంపుర నుండి సాయియు గ్రామంలో 12వ తరగతి బోర్డు పరీక్షకు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ సమీర్ యాదవ్ తెలిపారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులను చికిత్స నిమిత్తం భోపాల్కు తరలించామని, కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.