4 Killed : ల‌క్నోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. స్కూటీని ఢీకొట్టిన స్కార్పియో

ల‌క్నోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్కూటీని స్కార్పియో కారు ఢీకొట్టి 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన ఘటనలో ఇద్దరు

  • Written By:
  • Publish Date - June 1, 2023 / 06:36 AM IST

ల‌క్నోలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. స్కూటీని స్కార్పియో కారు ఢీకొట్టి 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారు కింద నలుగురితో పాటు స్కూటీ ఇరుక్కుపోయి 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. అదే స‌మ‌యంలో ఓ చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ఇది గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి వెళ్లి కారులో ఉన్న వారిని బయటకు తీశారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్ జోన్) కాసిమ్ అబ్ది తెలిపిన వివరాల ప్రకారం, స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా బాధితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతి చెందిన స్కూటీ డ్రైవర్‌ను సీతాపూర్‌కు చెందిన రామ్‌సింగ్ (35)గా గుర్తించారు. మృతుల్లో రామ్ సింగ్ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.