Road Accident : కర్నూలులో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఇద్ద‌రు మృతి

కర్నూలు జిల్లా కోడుమూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో,

Published By: HashtagU Telugu Desk
road accident

road accident

కర్నూలు జిల్లా కోడుమూరులో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో, ఐషర్‌ వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బొలెరోలో ప్రయాణిస్తున్న వారు హోళగుంద మండలం కొత్తపేట వాసులుగా గుర్తించారు. వారు కోడుమూరు వద్దకు చేరుకోగానే ఐషర్ వాహనం వారిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ప్ర‌యాణిక‌చులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. మ‌రో పద్నాలుగు మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  Last Updated: 25 Jun 2023, 12:03 PM IST