కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు లారీలు, అశోక్ లేలాండ్ వాహనం ఢీకొనడంతో రెండు లారీలు దగ్ధమయ్యాయి. కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ రోడ్డుపై ఆగిపోవడంతో వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత మరో లారీ, అశోక్ లేలాండ్ వాహనం ఢీకొన్నాయి. ఒకాదానికొకటి ఢీకొనడం వల్ల లారీ డీజిల్ ట్యాంకర్లో ఒకదాని నుండి ఆయిల్ లీక్ అయింది. దీంతో రెండు లారీలు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.