Road Accident: పెళ్లి కారును ఢీకొట్టిన టిప్పర్ లారీ.. నలుగురు మృతి

ఏపీలోని పల్నాడు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.

  • Written By:
  • Publish Date - January 27, 2023 / 10:19 AM IST

ఏపీలోని పల్నాడు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వెల్దుర్తి మండలంలోని ఉప్పలపాడు దగ్గర పెళ్లి కారును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Maharashtra : మ‌హారాష్ట్రలో రైలు కింద ప‌డి వ్యక్తి ఆత్మ‌హ‌త్య‌