Site icon HashtagU Telugu

Revanth Reddy: ఇదిగో డ్రామా మొదలైంది..

Template (10) Copy

Template (10) Copy

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు.

బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ కస్టడీలోకి తీసుకుంటారని వెల్లడించారు. ఇదంతా కూడా బీజేపీనే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమని చూపించడం కోసమేనా? అని రేవంత్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

“సరే, ఈ విషయం నేను బహిర్గతం చేశాను కాబట్టి, డ్రామా ఎలా సాగుతుందో చూద్దాం” అంటూ ట్వీట్ చేశారు. అటు, ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వరని తెలిసినా.. కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించేందుకు బీజేపీ పట్టుదలగా ఉందని తెలిసిందే.

Exit mobile version