Saturday: శనిశ్వరుడు.. ఈ పేరు వింటే చాలు చాలామంది తెగ బయపడి పోతూ ఉంటారు. ఆయన గుడికి వెళ్ళాలి అన్నా, ఆయనను పూజించాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కాగా శని దేవుడిని న్యాయ దేవుడుగా పిలుస్తూ ఉంటారు. అంటే మనం చేసే మంచి చెడు పనులను బట్టి శుభ, అశుభ ఫలితాలను అందిస్తాడని నమ్మకం. కాగా ప్రతీ ఒక్కరు జీవితంలో శని ప్రభావాలను తప్పకుండా ఎదుర్కొంటు ఉంటారు. వాటిలో ఏలినాటి శని, అర్ధష్టమ శని కూడా ఒకటి. గ్రహాల గమనం వలన ఏలినాటి శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు తలపెట్టిన పనులు ఆలస్యం కావడం, అనారోగ్య సమస్యలు ఏర్పడడం జరుగుతుంటాయి.
ఇవన్నీ చెప్పుకోడానికి పెద్ద సమస్యలు కానప్పటికీ, మన నిత్య జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయట. ఇలాంటప్పుడు శని బాధలు పోగొట్టుకొని సకల శుభాలు పొందాలంటే శనివారం ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వారంలో ఏడో రోజైన శనివారానికి చాలా ప్రత్యేకత ఉంది. శనివారం శనిదేవుని ఆరాధనకు ప్రధానమైనదిగా భావిస్తారు. అంతే కాదు ఈ రోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామికి, ఆంజనేయస్వామికి ఎంతో ప్రీతికరమైనది అంటారు. ఇంతటి విశిష్టమైన శనివారాన్ని కొందరు చెడు దినంగా భావించి కొత్త పనులను ప్రారంభించరు. ఈ సందర్భంగా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. శని గ్రహ ప్రభావం వలన కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం కొన్ని విశేషమైన కార్యక్రమాలను చేయాలని శాస్త్రం చెబుతోంది.
శనివారం నాడు నలుపు రంగు దుస్తులు ధరించి నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనీశ్వరునికి తైలాభిషేకం చేయిస్తే మంచిదట. శనీశ్వరుని వద్ద నువ్వుల నూనెతో దీపం వెలిగించి, గుడం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలట. ఈ నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్లకూడదని చెబుతున్నారు. నవ గ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలట. ఇలా చేయడం వలన శని అనుగ్రహాన్ని పొందవచ్చని చెబుతున్నారు. శనివారం వేంకటేశ్వరుని పూజిస్తే శని దేవుని అనుగ్రహం ఉంటుందట. ఈ రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించి వేంకటేశ్వరుని ఆలయాన్ని సందర్శించి కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటే మొక్కులు నెరవేరుతాయట. శనివారం ఆంజనేయ స్వామిని కొలిచిన వారికి శని బాధలు ఉండవని చెబుతున్నారు. శనివారం ఆంజనేయస్వామికి 11 ప్రదక్షిణాలు చేయాలట.
హనుమంతునికి శనివారం వడమాల సమర్పిస్తే శని బాధలు తొలగిపోతాయని చెబుతున్నారు. అదేవిధంగా శనివారం ఆంజనేయునికి ఆకుపూజ చేయిస్తే ఎలాంటి కష్టాలు అయినా తొలగిపోతాయట. శనివారం పరమేశ్వరునికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైనదని,.ఒక నియమం ప్రకారం 5 శనివారాలు కానీ, 9 శనివారాలు కానీ శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అనారోగ్య సమస్యలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. శనివారం శివాలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు కింద దీపం పెట్టి, రావి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్యలు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే శనివారం ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదట. డబ్బు అప్పుగా తీసుకోకూడదని చెబుతున్నారు. శనివారం నూతన వాహనాలు, ఇనుము వస్తువులు, నల్ల నువ్వులు, నూనె, ఉప్పు వంటి పదార్ధాలు కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు.
Saturday: శని బాధల నుంచి విముక్తి పొందాలంటే శనివారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Shani Dev