Ratan Tata: షేర్లు విక్రయించే యోచనలో రతన్ టాటా..!

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (Ratan Tata) ఈ-కామర్స్ కంపెనీ ఫస్ట్‌క్రై రాబోయే IPOలో తన మొత్తం వాటాను విక్రయించబోతున్నారు.

  • Written By:
  • Publish Date - December 29, 2023 / 11:30 AM IST

Ratan Tata: టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా (Ratan Tata) ఈ-కామర్స్ కంపెనీ ఫస్ట్‌క్రై రాబోయే IPOలో తన మొత్తం వాటాను విక్రయించబోతున్నారు. 2016 సంవత్సరంలో రతన్ టాటా 66 లక్షల రూపాయల పెట్టుబడితో బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో 0.02 శాతం వాటాను కొనుగోలు చేశారు. రతన్ టాటా సంస్థ ప్రారంభ పెట్టుబడిదారులలో ఒకరు. మనీ కంట్రోల్ వార్తల ప్రకారం.. పిల్లల దుస్తులు, గర్భధారణ సంబంధిత ఉత్పత్తులను విక్రయించే ఇ-కామర్స్ కంపెనీ అయిన ఫస్ట్‌క్రై రాబోయే IPOలో రతన్ టాటా మొత్తం 77,900 షేర్లను విక్రయించవచ్చని తెలుస్తోంది.

చిన్న పిల్లల కోసం ఉత్పత్తులను తయారు చేసే ఫస్ట్‌క్రై త్వరలో తన IPOను ప్రారంభించబోతోంది. ఇందుకోసం ఫస్ట్‌క్రై మాతృసంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి ముసాయిదా పత్రాలను సమర్పించింది. కంపెనీ దాఖలు చేసిన DRHP ప్రకారం.. ఈ IPOలో కంపెనీ 1,816 కోట్ల రూపాయల విలువైన తాజా షేర్లను జారీ చేయబోతోంది. ఇది కాకుండా పాత పెట్టుబడిదారులు, వాటాదారులు కూడా IPO లో తమ వాటాను విక్రయించబోతున్నారు.

Also Read: Insurance : రూ.320కే రూ.5 లక్షల బీమా.. తపాలా శాఖ ఇన్సూరెన్స్ స్కీమ్స్

FirstCry మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ ప్రారంభ పెట్టుబడిదారులలో మహీంద్రా & మహీంద్రా, న్యూక్వెస్ట్ ఆసియా, సాఫ్ట్‌బ్యాంక్, ప్రైవేట్ ఈక్విటీ సంస్థ TPG వంటి కంపెనీలు ఉన్నాయి. లైవ్ మింట్ వార్తల ప్రకారం.. ఈ ఐపిఓలో ఈ కంపెనీలన్నీ మొత్తం 5.44 కోట్ల షేర్లను విక్రయించబోతున్నాయి. ఈ షేర్లన్నీ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జారీ చేయబడతాయి. సమర్పించిన పత్రాల ప్రకారం.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో 0.58 శాతం వాటాను విక్రయించబోతోంది. బ్రెయిన్‌బిజ్‌లో 25.5 శాతం ప్రధాన వాటాను కలిగి ఉన్న సాఫ్ట్‌బ్యాంక్ మొత్తం IPOలో 2.03 కోట్ల షేర్లను విక్రయించనుంది.

We’re now on WhatsApp. Click to Join.

SEBIకి సమర్పించిన పత్రాలలో.. FirstCry మాతృ సంస్థ బ్రెయిన్‌బీస్ IPO ప్రారంభ తేదీని వెల్లడించలేదు. అయితే అనేక మీడియా నివేదికల ప్రకారం.. కంపెనీ IPO 2024 ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చు. దీనితో పాటు ఐపిఓలో షేర్ల ధరను కూడా కంపెనీ నిర్ణయించలేదు. రాబోయే కాలంలో కంపెనీ IPOకి సంబంధించిన మరింత సమాచారాన్ని పంచుకుంటుంది.