Site icon HashtagU Telugu

Physical Harassment: ఐసీయూలో ఉన్న మహిళపై అత్యాచారం..!

Minor Girl

Minor Girl

Physical Harassment: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని ఎంఐఏ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ వద్ద తీవ్ర కలకలం రేగే ఘటన వెలుగుచూసింది. ఐసీయూ వార్డులో చేరిన ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై ఎంఐఏ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తరలించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల కథనం ప్రకారం, జూన్ 4న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీ ఐసీయూ వార్డులో 32 ఏళ్ల మహిళపై అక్కడ పనిచేసే ఓ నర్సింగ్ సిబ్బంది సభ్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని జూన్ 2న ట్యూబ్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిసింది.

Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక పురోగతికి కేంద్రం పథకం

చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన ఆమె, తన భర్తకు జరిగిన దుర్ఘటన గురించి తెలిపింది. ఆసుపత్రి వార్డులో ఉన్నప్పుడు మంచం చుట్టూ కర్టెన్లు వేసి ఉండటాన్ని ఆమె గమనించినట్టు సమాచారం. బాధితురాలి మౌఖిక వాంగ్మూలం ప్రకారం.. నిందితుడు అత్యాచారానికి ముందుగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను బలవంతంగా బంధించాడు. ఆమె ప్రతిఘటించినా, మత్తు ప్రభావంతో చివరకు స్పృహ కోల్పోయింది.

మరుసటి రోజు స్పృహలోకి వచ్చిన ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆసుపత్రిలో ఉన్న మరో మహిళా రోగి భర్త కూడా ఇదే విషయాన్ని ధృవీకరించడంతో, బాధితురాలి భర్త వైద్య కళాశాల అధికారులను సంప్రదించాడు. అయితే, అధికారులు ఘటనను కప్పిపుచ్చేందుకు యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. బాధితురాలి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. నిందితుడి హంగామాతో తీవ్రమైన ఆందోళన నెలకొంది. నర్సింగ్ సిబ్బంది సభ్యుడిని పోలీసులు నేరస్థుడిగా గుర్తించి, తదుపరి చర్యలు చేపట్టారు.

Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?