Site icon HashtagU Telugu

Minister Post : మాట మార్చిన రాజగోపాల్..మంత్రి పదవి అవసరమే లేదు

Rajagopal Minister

Rajagopal Minister

తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటిచ్చారని గతంలో చెప్పిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Rajagopal).. తాజాగా ఆ మాట మార్చారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తనకు మంత్రి పదవి గురించి హామీ ఇచ్చారని చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈసారి మంత్రి పదవి తనకు అవసరం లేదని, అది ముఖ్యం కాదని స్పష్టం చేశారు.

ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి రహిత పాలన అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ సమాజం యొక్క ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఈ పరిణామం రాజగోపాల్ రెడ్డి రాజకీయ వైఖరిలో ఒక మార్పును సూచిస్తోంది. ఆయన మంత్రి పదవిపై అంతగా ఆసక్తి చూపడం లేదని, ప్రజల సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. అయితే భవిష్యత్తులో ఈ అంశంపై ఆయన ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also :Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్