ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. మంగళ, బుధవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం జైసల్మేర్, కోటా, గుణ, ఈశాన్య విదర్భ, పరిసర ప్రాంతాలు, రాయ్పూర్, పరదీప్ మరియు ఆగ్నేయ దిశగా తూర్పు-మధ్య బంగాళాఖాతం నుండి సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోఫో ప్రాంతం, యానాంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తాయని వెల్లడించింది.