కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ యాక్సిడెంటల్ హిందూ అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన ఆరోపణ చేశారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన రాహుల్పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ తనను తాను హిందువునని ఎప్పటికీ చెప్పుకోలేరని యోగి సెటైర్ వేశారు. రాహుల్ కేరళకు వెళ్లి అమేథీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, విదేశాలకు వెళ్లి భారత్కు వ్యతిరేకంగా మాట్లాడతారని విమర్శించారు. ఎన్నికల పర్యటనల తర్వాత రాహుల్ గాంధీ మాయమైపోతుంటారని యోగి చెప్పారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం లో మళ్ళి అక్కడ మతం పై చర్చ మొదలుపెట్టారు మన నాయకులు.