Prathipati Pulla Rao : విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది..?

సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంటే గుర్తొచ్చేది గొడ్డలి, కోడికత్తి, ఇసుక, లిక్కర్ మాఫియానే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ఫైర్ అయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే వైసీపీ పరిపాలన అని దుయ్యబట్టారు. ఏ ఊరికెళ్లినా విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది? అని నిలదీశారు. మీడియాపై వైసీపీ మూకల దాడి ఆ పార్టీ అసహనానికి నిదర్శనమన్నారు. ఈ దుర్మార్గపు పాలనకు […]

Published By: HashtagU Telugu Desk
Prathipati Pulla Rao

Prathipati Pulla Rao

సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంటే గుర్తొచ్చేది గొడ్డలి, కోడికత్తి, ఇసుక, లిక్కర్ మాఫియానే అని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) ఫైర్ అయ్యారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే వైసీపీ పరిపాలన అని దుయ్యబట్టారు. ఏ ఊరికెళ్లినా విధ్వంసం తప్ప అభివృద్ధి జాడేది? అని నిలదీశారు. మీడియాపై వైసీపీ మూకల దాడి ఆ పార్టీ అసహనానికి నిదర్శనమన్నారు. ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని వర్తక, వ్యాపార వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం “అరాచకం” నుండి ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

చిన్న, పెద్ద వ్యాపారులకు వేధింపులు లేని వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. చలివేంద్రం బజార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యాపారులకు తెదేపా మినీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేసిన సందర్భంగా ప్రత్తిపాటి పుల్లారావు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లుగా భయాందోళనలతో వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, మరో రెండు నెలల్లో తమ కష్టాలు తీరుతాయని హామీ ఇచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు జగన్ ప్రభుత్వంలో పెరిగిన పన్నులు, ఛార్జీలను ఎత్తిచూపారు, జగన్‌ను అధికారం నుండి తొలగించడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించారు. కొత్త ప్రభుత్వం వారి ఆస్తులను కాపాడుతుందని ఆయన హామీ ఇచ్చారు.

అంతేకాకుండా.. వైసీపీ టికెట్ల కేటాయింపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకే సీఎం జగన్ అత్యధికంగా అన్యాయం చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బీసీలపై పెత్తనం చెలాయించడమేనా బీసీ సాధికారత అని ప్రశ్నించారు. బీసీలు బలపడకూడదు, బాగుపడకూడదన్నదే జగన్‌ దురాలోచన అని చెప్పారు. బీసీలను మానసికంగా దెబ్బ తీసేందుకు వారిపై 26 వేలకు పైగా కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. తోట చంద్రయ్యతో సహా 300 మంది బీసీలను వైసీపీ అంతం చేసిందని ఆయన మండిపడ్డారు. పేరుకు బీసీలకు పదవులు, హోదాలు ఇచ్చి వారిపై జగన్‌ వర్గం పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు ప్రత్తిపాటి పుల్లారావు.

Read Also :Nagma: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన హీరోయిన్ నగ్మా.. నెట్టింట ఫొటోస్ వైరల్?

  Last Updated: 19 Feb 2024, 12:52 PM IST