ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇవాళ పూణేలో పర్యటించారు. అక్కడ డెహూ ప్రాంతంలో సంత్ తుకారమ్ ఆలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరుతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మోదీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆలయ పాలకమండలి సభ్యులు మోదీకి తుంబుర, చిడతలు బహూకరించారు. తుంబుర చేతుపట్టుకుని చిడతలు వాయించారు మోదీ. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లింఖించారు ఎన్నో కీర్తనలు రచించారు. ఆయన మరణం అనంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసి…దానికి ఆలయ రూపు కల్పించారు.
#WATCH | Prime Minister Narendra Modi offered prayers to Sant Tukaram Maharaj at Sant Tukaram temple in Dehu, Pune today.
(Source: DD) pic.twitter.com/r7a468F2Q9
— ANI (@ANI) June 14, 2022