PM Modi: బీజేపీకి రూ. 2 వేల విరాళం ఇచ్చిన ప్ర‌ధాని మోదీ..!

లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి 'పార్టీ ఫండ్' గా రూ. 2,000 విరాళంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అందించారు.

  • Written By:
  • Updated On - March 4, 2024 / 09:03 AM IST

PM Modi: లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి ‘పార్టీ ఫండ్’ గా రూ. 2,000 విరాళంగా ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అందించారు. అంతేకాకుండా దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. X (గతంలో ట్విట్టర్)లో NaMo యాప్ ద్వారా BJP ‘దేశ నిర్మాణానికి విరాళం’ ప్రచారంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ పౌరులను కోరారు. PM మోదీ పంచుకున్న రసీదు ప్రకారం.. ఒక రాజకీయ పార్టీకి ఇచ్చే విరాళాలకు ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం కంపెనీలకు సెక్షన్ 80GGB, సెక్షన్ 80GGC కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.

పార్టీకి విరాళం ఇచ్చిన రశీదును పంచుకుంటూ ప్రధాని మోదీ పోస్ట్ చేశారు NaMoApp ద్వారా #DonationForNationBuilding ప్రచారంలో భాగస్వాములు కావాలని నేను అందరినీ కోరుతున్నాను అని పేర్కొన్నారు. బీజేపీ క్రౌడ్ ఫండింగ్ ప్రచారాన్ని జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మార్చి 1న ప్రారంభించారు.

Also Read: UPI Transaction: సామాన్యుల‌కు మ‌రో షాక్ త‌గ‌ల‌నుందా..? యూపీఐపై ఛార్జీలు..!

JP నడ్డా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌లో ఇలా వ్రాశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చాలనే ప్రధాని మోడీ దృష్టికి నా వ్యక్తిగత మద్దతు ఇవ్వడానికి నేను బీజేపీకి విరాళం ఇచ్చాను. మనమందరం ముందుకు వచ్చి నమో యాప్‌ని ఉపయోగించి డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ సామూహిక ఉద్యమంలో చేరుదామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో బిజెపి 719 కోట్ల రూపాయల నిధులను సేకరించగలిగిందని, ఇది అంతకుముందు సంవత్సరం కంటే 17 శాతం ఎక్కువ అని ఎన్నికల కమిషన్ డేటా చూపించింది. 2021-2022లో రూ. 614 కోట్ల విరాళాలు అందుకుంది.

We’re now on WhatsApp : Click to Join

గత నెలలో దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పుతో ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని కొట్టివేసింది. ఇది భారతదేశంలోని రాజకీయ పార్టీలకు నిధుల ప్రధాన వనరుగా మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ‘రాజ్యాంగ విరుద్ధం’గా పేర్కొన్న ఈ పథకం 2018లో ప్రారంభించినప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు రాజకీయ పార్టీల ఖజానాకు రూ.12,000 కోట్లకు పైగా జమ చేసింది. ఎన్నికల సంఘం, ADR డేటా ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు స్వీకరించే పార్టీలలో బిజెపి ముందంజలో ఉంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా స్వీకరించిన విరాళాల్లో ఒక్క బీజేపీ వాటా 55% అంటే దాదాపు రూ.6,565 కోట్లు.