రక్షాబంధన్ పర్వదినం పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు చిన్నారులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పీఎంవో కార్యాలయ సిబ్బంది మోడీకి రాఖీ కట్టి గ్రీటింగ్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. హైదరాబాద్లోని ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అనాథ చిన్నారుల మధ్య రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు, మహిళలు ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.