న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబానికి ప్రగాఢసానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్గ్రేషియాను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. ఏపీలోని చిత్తూరులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు మోడీ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. మరణించిన వారి తదుపరి బంధువులకు రూ. PMNRF నుండి 2 లక్షలు, రూ. గాయపడిన వారికి 50,000 ఇవ్వబడుతుందని పీఎంవో కార్యాలయం తెలిపింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ట్విటర్లో బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణనష్టం జరిగిందని తెలిసి చాలా బాధపడ్డానని.. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
భాకరాపేట ప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం.. రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
