Kacheguda : కాచిగూడ రైల్వే స్టేష‌న్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్ ధ‌ర పెంపు

తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10...

  • Written By:
  • Publish Date - September 27, 2022 / 07:16 AM IST

తెలంగాణలో దసరా ఉత్సవాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కాచిగూడ ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. దసరా ఉత్సవాల సమయంలో ప్లాట్‌ఫారమ్‌లపై రద్దీ పెరుగుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌లపై ప్రజల ర‌ద్దీని నివారించడానికి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్లాట్‌ఫారమ్ ధరను పెంచింది. పెరిగిన టికెట్ ధ‌ర‌లు అక్టోబర్ 9, 2022 వరకు అమలులో ఉంటుంది.