Site icon HashtagU Telugu

Petrol Diesel Price: పెట్రో మోత…9వ రోజు పెరిగిన ధరలు..!

66

66

దేశంలో ఇంధన ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్​, డీజిల్​ పై 80పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.101.81కి చేరింది. డీజిల్​ ధర రూ.93.07 కి పెరిగింది. ముంబయిలోనూ పెట్రోల్​, డీజిల్​ ధరలు 84 పైసల చొప్పున పెరిగాయి. దీంతో అక్కడ లీటర్​ పెట్రోల్ ధర రూ.116.72కి, డీజిల్ ధర రూ.100.94కి చేరింది. ఇక ఏపీలో లీటర్ పెట్రోల్ ధర 87 పైసలు, డీజిల్ ధర 83 పైసలు పెరిగింది. ఫలితంగా గుంటూర్​ లో లీటర్​ పెట్రోల్​ రూ.117.32, డీజిల్ రూ.103.10 కి చేరింది. తెలంగాణ విషయానికొస్తే… హైదరాబాద్​ లో పెరిగిన ధరల అనంతరం లీటర్​ పెట్రోల్​ రూ.115.42, డీజిల్​ రూ.101.58గా ఉంది. మొత్తంగా చూస్తే… గడిచిన 10రోజుల వ్యవధిలో 9 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.

Exit mobile version