Shahrukh Khan: ఎయిర్‌పోర్ట్‌లో షారుఖ్‌ కు షాక్.. అడ్డుకున్న కస్టమ్స్‌ అధికారులు..!

శుక్రవారం జరిగిన షార్జా బుక్ ఫెయిర్‌లో పాల్గొన్న గౌరవ అతిధులలో షారుఖ్ ఖాన్ ఒకరు.

  • Written By:
  • Updated On - November 12, 2022 / 04:44 PM IST

యూఏఈలో జరిగిన షార్జా బుక్ ఫెయిర్‌లో పాల్గొన్న గౌరవ అతిధులలో షారుఖ్ ఖాన్ ఒకరు. షార్జా నుంచి వచ్చిన షారుక్ ఖాన్‌ను ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షారుక్ శుక్రవారం రాత్రి షార్జా నుంచి వచ్చినట్లు విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) వర్గాలు తెలిపాయి. అతడి వద్ద ఖరీదైన వాచీలు, వాటి కవర్లు ఉన్నాయి. ఈ వాచీల కోసం షారుక్ రూ.6.83 లక్షల కస్టమ్ డ్యూటీ చెల్లించాల్సి వచ్చింది.

విమానాశ్రయంలో సూపర్ స్టార్, అతని సిబ్బందిని కస్టమ్స్ అధికారులు ఒక గంట పాటు ఆపి యూఏఈలో కొనుగోలు చేసిన ఖరీదైన వాచీల గురించి అడిగారు. కస్టమ్స్ అధికారులు వారి బ్యాగులను స్కానింగ్ చేయగా సుమారు రూ.18 లక్షల విలువైన ఖరీదైన గడియారాలు లభించాయి. ఈ వాచీలు అంతర్జాతీయ బ్రాండ్‌లైన ఎస్పిరిట్, బాబున్ & జుర్బ్‌క్, యాపిల్ సిరీస్ వాచీలున్నాయి. వాటి మొత్తం విలువ రూ. 17 లక్షల 56 వేల 500 అని సమాచారం. వీటితో పాటు వాచీల ఖాళీ పెట్టెలు కూడా ఉన్నాయి.

విమానాశ్రయంలో దాదాపు గంట తర్వాత షారుక్, అతడి మేనేజర్ పూజా దద్లానీని కస్టమ్స్‌ అధికారులు విడిచిపెట్టారు. అయితే షారుఖ్ బాడీగార్డ్‌ రవితోపాటు మిగిలిన టీమ్‌ను అడ్డుకున్నారు. షారుఖ్ బాడీగార్డ్ రవి కస్టమ్ డ్యూటీ రూ.6.87 లక్షలు చెల్లించటంతో ఉదయం 8 గంటలకు బాడీగార్డ్‌ రవిని విడిచిపెట్టారు. ఈ జరిమానా మొత్తాన్ని షారుక్ క్రెడిట్ కార్డు నుంచే చెల్లించారు. యూఏఈలోని ఎక్స్‌పో సెంటర్‌లో నిర్వహిస్తున్న గ్లోబల్‌ సినిమా ఐకాన్‌, కల్చరల్‌ నరేటివ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి షారుఖ్‌ ఖాన్‌ దుబాయ్‌ వెళ్లారు. ఇక ఈ హీరో తన కొత్త చిత్రం పఠాన్ కోసం చాలా కష్టపడుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాలో షారుఖ్ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. ఇటీవలే రిలీజ్ అయినా ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొంది. ఇక ఈ సినిమా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 25న హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల కానుంది.