Site icon HashtagU Telugu

Chamala Kiran Kumar : అల్లు అర్జున్ అరెస్ట్‌తో సీఎం రేవంత్‌రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారు

Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar Reddy

Chamala Kiran Kumar : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా నాయకుడిగా ఎదిగారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుష్ప (అల్లు అర్జున్) అరెస్ట్ చేసిన సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాల కారణంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి చేసి పేరుపొందితే, రేవంత్ మాత్రం ప్రజల కోసం సాహసోపేత చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ఇప్పటికే పలువిధమైన స్టేట్‌మెంట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కేటీఆర్ నిర్దోషిగా తేలాలని కోరుకుంటున్నప్పటికీ, ఆయన తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత చర్యలు తీసుకోవాలని చెప్పారు. అధికారులు కేటీఆర్ మాటలను సీరియస్‌గా తీసుకోవద్దని చామల హెచ్చరించారు. ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు అంశంలో కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రాజెక్టు ఖర్చును అనవసరంగా పెంచి అవినీతికి తావిచ్చారని చామల విమర్శించారు. రూ. 7,000 కోట్ల ప్రాజెక్టును రూ. 12,000 కోట్లకు పెంచారని, ఇందులో రూ. 5,000 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపించారు. ఈ ప్రాజెక్టు మొత్తం కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ వివరించారని తెలిపారు.

Chandrababu : నిన్న హామీ..నేడు ఇంటి ముందుకు..అది చంద్రన్న మాట అంటే..!!

బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాధ్యతలను విస్మరించి రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. “2025 నాటికి అయినా బీఆర్ఎస్ నేతలకు జ్ఞానోదయం కలగాలని ఆశిస్తున్నాం,” అని చామల ఎద్దేవా చేశారు.

రైతు భరోసా పథకం కింద అనర్హులకు రూ. 22,000 కోట్లు పంపిణీ చేశారని, దీనివల్ల నిజమైన రైతులు నష్టపోయారని చామల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో రైతుల సంక్షేమాన్ని దెబ్బతీస్తోందని విమర్శించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్ రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, తనకు సంబంధం లేదని ఒక రోజు చెబుతారో, మరుసటి రోజు అన్ని బాధ్యతలు తనపైనే ఉన్నట్లు ప్రకటిస్తారో అని విమర్శించారు.

Local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి : మంత్రి పొన్నం ప్రభాకర్