ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ భారత్లో నిషేధించినట్లు ప్రకటించింది. ట్విట్టర్ ప్రకారం ఇది భారత ప్రభుత్వ చట్టపరమైన డిమాండ్పై జరిగింది. ట్విట్టర్ ఈ చర్యతో, ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం @GovtofPakistan ఈ అకౌంట్ చేసిన ఏ ట్వీట్ కూడా భారత్ లో కనిపించదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది మూడు వారాల క్రితమే జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై 5 ఏళ్ల నిషేధం విధించడంతో పాటు దాని ట్విట్టర్ ఖాతా కూడా నిషేధించింది. కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు మేరకు ట్విట్టర్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం క్రితమే ED, NIA ద్వారా PFI దేశంలో అనేక ప్రాంతాల్లో దాడులు జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల నుంచి ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా , ఇతర సంస్థలతో PFIకు ఉన్న సంబంధాల గురించి ఆధారాలను సేకరించింది.