Hyderabad: ఓల్డ్ సిటీలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఒవైసీ శంకుస్థాపన

హైదరాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Published By: HashtagU Telugu Desk
Hyderabad

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ మునిసిపల్ డివిజన్‌లలో 20 వాటర్ పైప్‌లైన్ వేయడం మరియు 12 సీవరేజీ లైన్ పనులు చేపట్టనున్నారు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ నీటి కాలుష్యం సంబంధిత ఫిర్యాదుల కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి ముగింపు పలికేందుకు మార్చి మూడవ వారం నుండి పనులను ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు.

యాకుత్‌పురాలోని సంతోష్‌నగర్, దబీర్‌పురా, కూర్మగూడ, రెయిన్‌బజార్ మున్సిపల్ డివిజన్లలో రూ.1.35 కోట్లతో ఆదివారం శంకుస్థాపన చేయనున్నారు.ఒవైసీ తన ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోడ్ల విస్తరణ పనులకు రూ.200 కోట్లు, బాధిత ఆస్తుల యజమానులకు త్వరలో చెక్కులు చెల్లిస్తామన్నారు.

Also Read: Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?

  Last Updated: 09 Mar 2024, 07:00 PM IST