Site icon HashtagU Telugu

Cricket Betting : ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్‌.. రూ.20ల‌క్ష‌లు స్వాధీనం

Cricket

Cricket

వరంగల్ జిల్లాలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. వీరి వ‌ద్ద‌ నుంచి రూ.20.80 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న వారిని మాడిశెట్టి ప్రసాద్, కొత్తూరు రాజు, బుర్రా నాగరాజుగా గుర్తించినట్లు పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ముఠా నాయకుడు మాడిశెట్టి ప్రసాద్‌, హన్మకొండలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న తన ఇంటిని మరో బుకీ కొత్తూరు రాజుతో కలిసి బెట్టింగ్‌ స్థావరంలా మార్చినట్లు సమాచారం. వీరిద్దరూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువతను భారీ లాభాలతో ఆకర్షించేవారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై బుకీలు ఫోన్‌లలో మెసేజ్‌లు పెట్టి బెట్టింగ్‌లకు ప్రోత్సహించారు. పంటర్లు గెలిస్తే రెట్టింపు పందెం డబ్బు చెల్లించి బుకీలకు 5 నుంచి 25 శాతం వరకు కమీషన్‌ వచ్చేది. మాడిశెట్టి ప్రసాద్ పై గతంలో కమిషనరేట్ పరిధిలో మూడు కేసులు నమోదయ్యాయి. అదనపు డిసిపి వైభవ్ ఆర్ గైక్వాడ్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ బృందాలు మమ్నూర్‌లోని ఒక ప్రదేశంలో పక్కా సమాచారంతో దాడి చేసి అరెస్ట్ చేశారు.

Exit mobile version