అతిలోక సుందరి శ్రీదేవి జయంతి సందర్భంగా కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్ తన తల్లితో గడిపిన అమూల్యమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. జాన్వీ కపూర్ ప్రత్యేకమైన ఫొటోను షేర్ చేశారు. తన తల్లి శ్రీదేవితో కలిసి ఉన్న చిన్ననాటి చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన జాన్వీ ఎమోషన్ అయ్యింది. “హ్యాపీ బర్త్డే అమ్మా. నేను నిన్ను మరింత ఎక్కువగా మిస్ అవుతున్నాను. నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తున్నాను” అని క్యాప్షన్ ఇచ్చింది. ఫొటోలో శ్రీదేవి కెమెరాకు ఫోజు ఇస్తూ జాన్వీని కౌగిలించుకోవడం చూడవచ్చు.
చిన్న కూతురు ఖుషీ తన ఇన్స్టాగ్రామ్ లో మోనోక్రోమ్ చిత్రాన్ని పోస్ట్ చేసింది. శ్రీదేవి కుమార్తె ఖుషీ చెంపపై ముద్దుపెట్టడం చూడొచ్చు. జాన్వీ తొలి చిత్రం ధడక్కి కొన్ని నెలల ముందు 2018లో ప్రముఖ నటి శ్రీదేవి మరణించారు. కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ 7 ఇటీవలి ఎపిసోడ్లో జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవిని కోల్పోయిన తర్వాత జీవితం ఎలా మారిందో గురించి ఓపెన్ అయ్యింది. ” అమ్మా లోటు ఇప్పటికీ భాధిస్తోంది. అర్జున్ భయ్యా, అన్షులా దీదీల వల్ల మాత్రమే సంతోషంగా ఉన్నాను. అమ్మ ఆశయాలు నాలో ఇప్పటికీ ఉన్నాయి. నేను గడిపిన జీవితం ఒక ఫాంటసీ’’ అంటూ స్పందించింది జాన్వీ కపూర్.