Odisha: ఒడిశా తొలి గిరిజన ముఖ్య‌మంత్రి హేమానంద బిస్వాల్ కన్నుమూత‌

ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ స్వల్ప అస్వస్థతతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు ప్ర‌స్తుతం 82 సంవ‌త్స‌రాలు.

Published By: HashtagU Telugu Desk
Hemananda Biswal 480 Imresizer

Hemananda Biswal 480 Imresizer

ఒడిశా తొలి గిరిజన ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి హేమానంద బిస్వాల్ స్వల్ప అస్వస్థతతో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయసు ప్ర‌స్తుతం 82 సంవ‌త్స‌రాలు. ఝార్సుగూడ జిల్లాకు చెందిన భుయాన్ గిరిజనుడైన బిస్వాల్ 1989 నుండి 1990 వరకు మరియు 1999 నుండి 2000 వరకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

డిసెంబర్ 1989లో లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్(ఐ)ని ఓడించిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జెబి పట్నాయక్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. డిసెంబరు 1999లో, 1999లో ఒడిశా తీరాన్ని చీల్చి చెండాడిన సూపర్ సైక్లోన్ తర్వాత సహాయక చర్యలు మరియు పునరావాస చర్యలలో వైఫల్యం కారణంగా మాజీ ముఖ్యమంత్రి గిరిధారి గమాంగ్ స్థానంలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 2000 అసెంబ్లీ ఎన్నికలలో BJD-BJP కలయికతో కాంగ్రెస్‌ను ఓడించారు. ఆ తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాలేకపోయింది.

బిస్వాల్ జార్సుగూడ జిల్లాలోని కిరిమిరా పంచాయతీ సమితి ఛైర్మన్‌గా తన రాజకీయ ప్ర‌స్తానాన్ని ప్రారంభించారు.1974లో లైకెరా నియోజకవర్గం నుంచి తొలిసారి ఒడిశా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో సుందర్‌గఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 1995లో ఉప ముఖ్యమంత్రిగా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ సంతాపం వ్యక్తం చేస్తూ, బిస్వాల్ తన జీవితాంతం కాంగ్రెస్ భావాజాలం కోసం ప‌నిచేశార‌ని తెలిపారు. బిస్వాల్ ని కోల్పోవ‌డం కాంగ్రెస్ పార్టీకి తీర‌ని లోట‌న్నారు.

  Last Updated: 26 Feb 2022, 09:00 AM IST