ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహించిన హీరో నిఖిల్ మొదటి పాన్ ఇండియా చిత్రం స్పై షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. టీమ్ ప్రస్తుతం నిఖిల్, ఇతర ప్రముఖ తారాగణంతో కూడిన కొన్ని యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది. ఈ వర్కింగ్ స్టిల్లో, నిఖిల్ నటి ఈశ్వర్య మీనన్, బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్పాండే, హాస్యనటుడు అభినవ్ గోమతం, మరికొంత మంది ఉన్నారు. యాక్షన్ సీక్వెన్స్ను హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ పర్యవేక్షిస్తున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నఖరా బాలీవుడ్ లెన్స్మెన్ జూలియన్ అమరుతో కలిసి పనిచేస్తున్నారు. చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా కె రాజ శేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఎడ్ ఎంట్రన్మెంట్స్పై నిర్మిస్తున్నారు. యాక్షన్తో కూడిన స్పై థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రం దసరా, 2022లో విడుదల కానుంది.