మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులు, ఎన్నికల్లో పనిచేసిన నేతలతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి భవన్కు వచ్చిన ప్రభాకర్రెడ్డి కేసీఆర్ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కేసీఆర్కు ప్రభాకర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన నేతలను కేసీఆర్ అభినందించారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. pic.twitter.com/tnHcTvimsw
— Telangana CMO (@TelanganaCMO) November 7, 2022