Pubg Murder: పబ్జీ కోసం తల్లిని హత్య.. ఇన్నాళ్లకు కేసులో మరో ట్విస్ట్!

  • Written By:
  • Publish Date - June 13, 2022 / 09:00 PM IST

ప్రస్తుత కాలంలో ఆన్లైన్ గేమ్స్ వచ్చిన తర్వాత పిల్లలు పూర్తిగా వాటికి బానిసా అవుతున్నారు. ఈ క్రమంలోనే పబ్జీ ఆటకు ఎంతోమంది బానిసలుగా మారి చివరికి హంతకులుగా మిగిలిపోతున్నారు. నిద్రాహారాలు మాని ఎప్పుడు సెల్లుకి అంకితమైన పిల్లలను దండిస్తున్న తల్లిదండ్రుల పట్ల పిల్లలు హంతకులుగా మారుతున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా తన తల్లి తనని పబ్జీ గేమ్ ఆడనివ్వడం లేదంటూ తల్లి పై కోపంతో రివాల్వర్ తో కొడుకు తల్లిని కాల్చి చంపిన ఘటన వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ కేసుపై పోలీసులు పెద్దఎత్తున విచారణ చేపట్టారు. అయితే ఈ కేసులో భాగంగా రోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇకపోతే ఈ కేసు విచారణలో భాగంగా ఈ కేసులో మరొక వ్యక్తి పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లి నిత్యం తనని తిడుతుందని అర్ధరాత్రి సమయంలో 16 సంవత్సరాలు కుమారుడు తన తల్లిని కాల్చిచంపారు. తన తల్లి అక్కడికక్కడే మరణించడంతో మూడు రోజుల పాటు తన తల్లి శవాన్ని రూమ్ లోనే పెట్టి వాసన రాకుండా రూమ్ ఫ్రెష్ నర్ ఉపయోగించారు. ఈ విషయం గురించి బయట ఎక్కడైనా చెబితే తనని కూడా చంపుతానని తొమ్మిది సంవత్సరాల చెల్లిని కూడా బెదిరించాడు.

1

తాజాగా ఈ కేసు గురించి మరొక విషయం బయటపడింది. ఈ కేసులో భాగంగా బాలుడి తండ్రి, ఆర్మీ అధికారి నవీన్‌ ప్రమేయం కూడా ఉందేమోనని అనుమానిస్తున్నారు. తన భార్య చనిపోయిందనే విషయం తెలియగానే నవీన్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తన బంధువులకు సమాచారం ఇచ్చి అక్కడికి రప్పించారు. దీంతో పోలీసులు అతనిని కూడా అనుమానిస్తున్నారు. మూడు రోజుల పాటు తన భార్య ఫోన్లో మాట్లాడకపోవటంతో ఆరా తీసిన నవీన్ కి తన కుమారుడు తన తల్లిని ఎలక్ట్రీషియన్ కాల్చి చంపారని సమాధానం చెప్పారు. ఇలా బాలుడు ప్రతిసారి గందరగోళ సమాధానాలు చెప్పడంతో ఈ కేసుపై పలు అనుమానాలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు బాలుడుతో పాటు తన తండ్రి నవీన్ ను కూడ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.