Site icon HashtagU Telugu

APSRTC : 1000 ఎలక్ట్రిక్ బ‌స్సుల‌ను కొనుగోలు చేయ‌నున్న ఏపీఎస్ ఆర్టీసీ

Tirumala Bus

Tirumala Bus

రాష్ట్రంలోని పలు రూట్లలో నడపడానికి 1,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రభుత్వ యాజమాన్యంలోని ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) అనుబంధ సంస్థ అయిన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్‌కు ఈ ప్రతిపాదన ఆర్టీసీ అధికారులు పంపారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను కవర్ చేసే 11 రూట్లలో కొత్త ఈ-బస్సులను నడపాలని APSRTC అధికారులు నిర్ణ‌యించారు. తిరుపతి-తిరుమల మధ్య 250, విజయవాడ-విశాఖపట్నం మధ్య 400 నుంచి 500, మిగిలినవి చిన్న ప్రయాణాల్లో ఇతర నిర్దేశిత రూట్లలో న‌డ‌ప‌నున్నారు. కాస్ట్‌ కాంట్రాక్ట్‌ పద్ధతిలో బస్సులను నడపనున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ఈ -బస్సును కొనుగోలు చేసిన ఆపరేటర్ దాని సేకరణ ఖర్చును భరిస్తుంది. బస్సును APSRTCతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇది బస్సును పార్కింగ్ చేయడానికి, నిర్వహించడానికి స్థలాన్ని అందిస్తుంది. ఇప్పటికే తిరుపతి-తిరుమల, రేణిగుంట విమానాశ్రయం-తిరుపతి, తిరుపతి-మదనపల్లె, తిరుపతి-కడప, తిరుపతి-నెల్లూరు వంటి పలు రూట్లలో 100 ఈ-బస్సులను నడుపుతున్నారు. తిరుపతి-తిరుమల మధ్య ఈ-బస్సుల నిర్వహణకు ఆపరేటర్‌కు కిలోమీటరుకు 53 చొప్పున చెల్లిస్తారు.