Nepal President: నేపాల్ అధ్యక్షుడు (Nepal President) రామ్చంద్ర పౌడెల్ (Ram Chandra Poudel) శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛాతీలో విపరీతమైన నొప్పి రావడంతో ఆయనను త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్లోని మన్మోహన్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో అడ్మిట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని నేపాల్ అధ్యక్షుడి పర్సనల్ సెక్రటరీ చిరంజిబి అధికారి ధృవీకరించారు.
ఛాతీ నొప్పితో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ శనివారం మరోసారి ఆసుపత్రిలో చేరారు. నేపాల్ ప్రెసిడెంట్ పర్సనల్ సెక్రటరీని ఉటంకిస్తూ మీడియా ఏజెన్సీ ANI ఈ సమాచారాన్ని అందించింది. ఛాతీలో నొప్పి రావడంతో రాష్ట్రపతి రామచంద్ర పౌడెల్ను ఈ ఉదయం త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్లోని మన్మోహన్ కార్డియోథొరాసిక్ వాస్కులర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్లో చేర్చినట్లు అధికారి తెలిపారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం సాధారణంగానే ఉందన్నారు.
Also Read: China Debt Trap : డ్రాగన్ లోన్ ట్రాప్ లో పాక్..మరో 8100 కోట్ల రుణం
అయితే ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు ఏప్రిల్లో పొత్తికడుపు నొప్పి, ఊపిరి ఆడకపోవడాన్ని ఫిర్యాదు చేసిన తర్వాత పౌడెల్ను మహారాజ్గంజ్లోని త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్లో రెండుసార్లు చేర్చారు. దీని తరువాత పౌడెల్ చికిత్స కోసం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చేరారు. ఛాతీ సంబంధిత వ్యాధికి ఎయిమ్స్లో విజయవంతమైన చికిత్స తర్వాత నేపాల్కు తిరిగి వచ్చారు.
మార్చిలో ఎన్నుకున్నారు
పౌడెల్ చికిత్సలో పాల్గొన్న వైద్యులు మరికొన్ని వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నేపాలీ కాంగ్రెస్కు చెందిన పౌడెల్ మార్చిలో దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నేపాల్ మూడో అధ్యక్షుడిగా పౌడెల్ బాధ్యతలు చేపట్టారు. ఇంతకు ముందు ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో పలుమార్లు స్పీకర్గా, మంత్రిగా పనిచేశారు.