Site icon HashtagU Telugu

Murder : విజ‌య‌వాడ‌లో దారుణం.. న‌డిరోడ్డుపై మ‌హిళ హ‌త్య‌

Murder

Murder

విజ‌యవాడ‌లో దారుణం చోటుచేసుకుంది. న‌గ‌రంలోని చ‌నుమోలు వెంక‌ట్రావు ఫ్లైఓవ‌ర్‌పై రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఓ మ‌హిళ‌ను వ్య‌క్తి దారుణంగా న‌రికి చంపాడు. మృతురాలు నాగ‌మ‌ణిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజేష్ మృతురాలి అల్లుడు.. త‌నకు విడాకులు ఇవ్వాలని భార్య‌ను నాగ‌మ‌ణి ప్రోత్స‌హించినందుకు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు. విడాకుల పిటిషన్ వేయమని తన కుమార్తెను ప్రోత్సహించినందుకు నాగమణిపై రాజేష్ పగ పెంచుకున్నాడు. భార్యతో విడిపోవడానికి అత్తమామలే కారణమని భావించిన అతడు ఆమెను కొబ్బరికాయ కొట్టే కొడవలితో నరికి చంపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో నాగమణి అక్కడికక్కడే మృతి చెందిందని, రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంటింటికీ బట్టలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. పోలీసులు నిందితుడు రాజేష్‌పై ఐసీసీ 302 సెక్ష‌న్ కింద కేసు నమోదు చేశారు.

Exit mobile version