ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇటీవల ఖరీదైన, విలాసవంతమైన, కారును సొంతం చేసుకున్నారు. ఏకంగా 13.14 కోట్లను ఖర్చుపెట్టి అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కల్లినాన్ హ్యాచ్బ్యాక్ను ముఖేష్ అంబానీ కొనుగోలు చేశారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కారులు తయారు చేసే రోల్స్ రోయ్స్సం సంస్థ తయారు చేసిన ఈ కారును ముఖేష్ అంబానీ తన అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు.
ఇక ఈ కారు అసలు ధర 6.95 కోట్లు కాగా.. ముఖేష్ అంబాని అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసేసరికి, ఆ కారు విలువ 13.14 కోట్లకు పెరిగింది. ఇక ఈ కారు రిజిస్ట్రేషన్కు ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళగా, అంబానీ లగ్జరీ కారు ధర చూసి అక్కడి అధికారుల మైండ్ బ్లాక్ అయ్యిందట. ఇప్పటి వరకు ఇంత ఖరీదైన కారును చూడలేదని ఆర్టీఓ అధికారులు చెప్పుకొచ్చారు. ఇక ఈ కారు రిజిస్ట్రేషన్ కోసం భారీగానే ఖర్చుపెట్టారని, అలాగే రోడ్టాక్స్ కూడా పెద్ద మొత్తంలో చెల్లించారు.
అంబానీ తనదగ్గర ఉండే అన్ని కార్లకు వీఐపీ నెంబర్ ఒకటి ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఆయన నెంబర్ వన్ను లక్కీగా భావిస్తారు. ఈసారి కూడా తన లగ్జరీ కారుకు ఏకంగా 12 లక్షలు ఖర్చు పెట్టి మరీ వీఐపీ నెంబర్ 0001 నెంబరును దక్కించుకున్నారు. కేవల అంబానీ కోసం కొత్త నెంబర్ సిరీస్ ఓపెన్ చేయాల్సి వచ్చిందని ఆర్టీఓ అధికారులు చెప్పారు. ఇక రోడ్టాక్స్ 20లక్షలు, రోడ్ సేఫ్టీ టాక్స్ 40 వేలు చెల్లించారని ఆర్టీఓ అధికారులు తెలిపారు. 2018లో భారత్లో విడుదలైన ఈ కల్లినాన్ 6749సీసీ సామర్ధ్యంతో V12 ఇంజిన్తో వస్తుంది. 563 bhp పవర్ ను 850 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.