Site icon HashtagU Telugu

Cop Kills: డబ్బులు అడగడంతో బాలుడిని హత్య చేసిన కానిస్టేబుల్

Crime

మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో రథయాత్ర సందర్భంగా ఆకలి తీర్చుకోవడానికి పదే పదే డబ్బు అడిగినందుకు ఆరేళ్ల బాలుడిని ఓ పోలీసు హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. “ఓ బాలుడు పదే పదే రవి శర్మ (పోలీస్ కానిస్టేబుల్)ని ఆహారం కొనుక్కోవడానికి కొంత డబ్బు అడిగాడు. కాని పోలీస్ కానిస్టేబుల్ డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు.

అక్కడితో ఆగకుండా బాలుడిని తరిమికొట్టాడు. అయితే అబ్బాయి మళ్లీ వచ్చి డబ్బులు అడిగాడు. ఆవేశంలో ఉన్న పోలీసు మైనర్‌ని గొంతు కోసి చంపాడు” అని దటియా పోలీసు సూపరింటెండెంట్ అమన్ సింగ్ రాథోడ్ మీడియాకు తెలిపాడు. తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని, బాలుడు నిరంతరం తన నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో బాధపడ్డానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసును తక్షణమే సర్వీసు నుంచి తొలగించాలని కోరుతూ పలువురు రాథోడ్ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి లేఖ రాశారు.

Exit mobile version