Site icon HashtagU Telugu

Bomb Threat: గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్తాన్‌కు మళ్లింపు

Emergency Landing

Emergency Landing

మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఈ బెదిరింపు గోవా ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు ఇమెయిల్ ద్వారా పంపబడింది. దీని తరువాత భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ముందే విమానం ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించబడింది. ఉజ్బెకిస్థాన్‌లో విమానాన్ని ల్యాండ్ చేసిన తర్వాత, దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అజూర్ ఎయిర్ విమానంలో 247 మంది ప్రయాణికులు ఉన్నారని, వారిని ఉజ్బెకిస్థాన్‌లోని విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

బాంబు పేలుస్తామనే బెదిరింపుతో గోవాకు వస్తున్న విమానాన్ని భయంతో దారి మళ్లించడం ఇది రెండో కేసు. జనవరి ప్రారంభంలోనే అజూర్ ఎయిర్‌కు చెందిన చార్టర్ విమానం బాంబు బెదిరింపుకి గురైనట్లు నివేదించింది. ఆ తర్వాత విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించారు. ఈ విమానంలో 236 మంది ప్రయాణికులు ఉన్నారు.  AZV2463.. Azur Air ద్వారా నిర్వహించబడుతున్న విమానం దక్షిణ గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో తెల్లవారుజామున 4.15 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉండగా.. అది భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ముందే ఉజ్బెకిస్థాన్‌కు మళ్లించబడిందని ఆయన చెప్పారు.

Also Read: Bomb Threat Call: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు.. తనిఖీ చేసిన అధికారులు

ఓ అధికారి ప్రకారం.. దబోలిమ్ విమానాశ్రయం డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12.30 గంటలకు ఈ-మెయిల్ వచ్చింది. అందులో విమానంలో బాంబు ఉందని పేర్కొన్నారు. దీని తర్వాత విమానం ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించబడింది. బాంబు బెదిరింపుతో మాస్కో నుండి గోవా వెళ్లే విమానం గుజరాత్‌లోని జామ్‌నగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయబడిన దాదాపు రెండు వారాల తర్వాత ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు. మాస్కో నుంచి గోవా వెళ్తున్న అజూర్ ఎయిర్ విమానంలో బాంబు ఉందన్న సమాచారంతో భారత అధికారులు అప్రమత్తమయ్యారని రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.