MLC Kavitha : నేడు మరోసారి ఈడీ విచార‌ణ‌కు వెళ్ల‌నున్న క‌విత‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఈడీ అధికారులు ఈ రోజు మ‌రోసారి ప్ర‌శ్నించ‌నున్నారు. నిన్న

  • Written By:
  • Publish Date - March 21, 2023 / 08:25 AM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ఈడీ అధికారులు ఈ రోజు మ‌రోసారి ప్ర‌శ్నించ‌నున్నారు. నిన్న ప‌దిన్న‌ర గంట‌ల పాటు ఈడీ అధికారులు క‌విత‌ను ప్ర‌శ్నించారు. లిక్క‌ర్ స్కాంలో రూ. 100 కోట్ల ముడుపులు, సౌత్​ గ్రూప్​ పాత్రపై ఆరాతీసినట్లు సమాచారం. సోమవారం ఉదయం 10.20 గంటలకు ఢిల్లీలోని సీఎం కేసీఆర్​ క్యాంప్​ ఆఫీసు నుంచి ఈడీ హెడ్​ క్వార్టర్స్​కు కవిత వెళ్లారు. డాక్యుమెంట్లు, ఈడీ నోటీసులతో 10.30 గంటల తర్వాత ఆమె లోపలికి వెళ్లగా.. తొలుత అక్కడి సిబ్బంది వ్యక్తిగత సమాచారాన్ని రికార్డు చేశారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల ఈడీ ఆఫీసర్ల టీమ్​ విచారణ మొదలుపెట్టింది. ప‌దిన్న‌ర గంట‌ల పాటు క‌వితను ఈడీ అధికారులు విచారించారు. ఈ రోజు మ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని క‌విత‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు 11.30కు క‌విత ఈడీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు.