Etala Rajendar: కేసీఆర్ ని ‘పీకే’ కాపాడ‌లేరు!

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రెస్ మీట్‌లో చేసిన ప్రకటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు.

  • Written By:
  • Updated On - February 17, 2022 / 11:38 AM IST

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకుంటానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవల ప్రెస్ మీట్‌లో చేసిన ప్రకటనపై బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ప్ర‌శాంత్ కిషోర్ కేసీఆర్‌ని ర‌క్షించ‌లేర‌ని ఈట‌ల రాజేంద‌ర్ వ్యాఖ్యానించారు. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహకర్త కావచ్చు కానీ తెలంగాణ ప్రజల్లో ఎక్కువ మేధావులు, విజ్ఞానవంతులు ఉన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. కొంతమంది నాయకులు చరిత్ర గమనాన్ని స్క్రిప్ట్ చేయలేరు. ఆ పని చేసే శక్తి ప్రజలకే ఉంది, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కాళ్ల కింద నేల జారిపోతోందని, వ్య‌వ‌సాయ బోర్ల‌కు కేంద్రం మీటర్లు బిగించిందని సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజేందర్‌ మండిపడ్డారు. పరిశ్రమలకే కాదు వ్యవసాయానికి కూడా కేంద్రం కరెంటు ఇస్తుందని అన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసే వరకు క్షురకులు, ధోబీలకు విద్యుత్‌ సబ్సిడీ ఇస్తామన్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీని ఎందుకు అమలు చేయలేదని రాజేందర్‌ ప్రశ్నించారు.