ఐటీశాఖలో భారీగా బదిలీలు అయ్యాయి. 83 మంది చీఫ్ కమీషనర్ స్థాయి అధికారుల కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఐటీ శాఖ అధికారులను బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రిన్సిపల్ కమీషనర్ స్థాయిలో 155 మందిని బదిలీ చేసింది. ఐటీ శాఖ చరిత్రలోనే తొలిసారిగా భారీగా బదిలీలు జరగడం ఇదే మొదటిసారి. హైదరాబాద్ ఐటీ ఇన్వెస్టిగేషన్ డీజీ గా సంజయ్ బహదూర్… విజయవాడ ఐటీ చీఫ్ గా శ్రీపాద రాధాకృష్ణ.. హైదరాబాద్ ఐటీ చీఫ్ గా శిశిర్ అగర్వాల్ లను కేంద్రం బదిలీ చేసింది.