Massive Fire At Bhopal: భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధం

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని స్టేట్ డైరెక్టరేట్‌లోని సత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive Fire At Bhopal)లో సుమారు రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధమయ్యాయి.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 08:38 AM IST

Massive Fire At Bhopal: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని స్టేట్ డైరెక్టరేట్‌లోని సత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive Fire At Bhopal)లో సుమారు రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధమయ్యాయి. మంటలు చాలా తీవ్రంగా ఉండటంతో 50 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ఆరో అంతస్థులో గాలి వీచడంతో సోమవారం అర్థరాత్రి మళ్లీ మంటలు చెలరేగాయి. సత్పురా భవనం నుంచి ఉదయం 5.30 గంటల వరకు పొగలు వస్తూనే ఉన్నాయి, అయితే మంగళవారం ఉదయం 7.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.

మంటలను అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ బృందం

మంటలను అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ బృందం సోమవారం అర్థరాత్రి భోపాల్‌కు చేరుకుంది. మూడో అంతస్తులోని గిరిజన శాఖలో ఏర్పాటు చేసిన ఏసీలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ముఖ్యమంత్రి సచివాలయం ఎయిర్ ఫోర్స్ బృందంను పిలిపించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచనల మేరకు ఏఎన్-32 విమానం, ఎంఐ-15 హెలికాప్టర్లు రాత్రికి రాత్రే భోపాల్ చేరుకున్నాయి. దీని కోసం రాజభోజ్ విమానాశ్రయం భోపాల్ రాత్రంతా తెరిచి ఉంది.

Also Read: Biparjoy: తీవ్ర తుఫానుగా బిపార్జోయ్.. జూన్ 15 నాటికి గుజరాత్ తీరం దాటనున్న బిపార్జోయ్

విచారణకు బృందం ఏర్పాటు

అర్థరాత్రి రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ నరోత్తమ్ మిశ్రా, ఆరోగ్య మంత్రి డాక్టర్ ప్రభురామ్ చౌదరి కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్) రాజేష్ రాజౌరా నేతృత్వంలో నలుగురు సభ్యుల విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం రెండు రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది. కమిటీలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీరజ్ మాండ్లోయ్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుఖ్‌బీర్ సింగ్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఫైర్) అశుతోష్ రాయ్ ఉన్నారు.