Site icon HashtagU Telugu

11 Jawans Killed: దంతేవాడలో మావోయిస్టుల కాల్పులు.. 11 మంది జవాన్లు హతం!

Dantewada: మావోయిస్టులు (Maoists) జరిపిన పేలుడులో 11 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటనతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది. థానా అరన్‌పూర్ పరిధిలో మావోయిస్టు క్యాడర్ ఉన్నారనే సమాచారంతో దంతెవాడ నుంచి యాంటీ నక్సల్ ఆపరేషన్ కోసం DRG ఫోర్స్‌ను పంపారు. ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా మావోయిస్టులు అరన్‌పూర్ రోడ్డుపై IED పేల్చారు. దీంతో ఆపరేషన్‌లో పాల్గొన్న 10 మంది DRG జవాన్లు (Army), ఒక డ్రైవర్ వీరమరణం పొందారు. సైనికులతో నిండిన వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు.

అయితే ఈ ఘటనలో జవాన్లకు ఎంత నష్టం జరిగిందన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. సమాచారం ప్రకారం జవాన్లు ఆపరేషన్‌ (Operation) లో ఉన్నారు. ఈ సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన దంతెవాడలోని అరన్‌పూర్‌లో జరుగుతోంది. ఈ ఘటనలో చాలామంది డీఆర్‌జీ జవాన్లు గాయపడినట్లు సమాచారం. పేలుడు ధాటికి సైనికులతో కూడిన వాహనం దగ్ధమైంది.

Also Read: NTR Hollywood: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. జూనియర్ కు హాలీవుడ్ ఆఫర్!