Manoj Jarange: మరాఠా రిజర్వేషన్లు.. ఉద్యమాన్ని విరమించిన మనోజ్ జరంగే.!

మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం తలవంచింది. మనోజ్ జరంగే పాటిల్ (Manoj Jarange), ఇతర ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఈరోజు మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Manoj Jarange

Safeimagekit Resized Img (2) 11zon

Manoj Jarange: మరాఠా రిజర్వేషన్ ఉద్యమానికి మహారాష్ట్రలోని షిండే ప్రభుత్వం తలవంచింది. మనోజ్ జరంగే పాటిల్ (Manoj Jarange), ఇతర ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత ఈరోజు మనోజ్ జరంగే తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం వాశిలోని శివాజీచౌక్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మంత్రి దీపక్ కేసర్కర్, మంగళ్ ప్రభాత్ లోధా, ఇతర రాజకీయ, మరాఠా రిజర్వేషన్ కార్యకర్తలు హాజరవుతారని చెబుతున్నారు. ఈ సమయంలోజరంగేకు రసం ఇవ్వడం ద్వారా దీక్ష ముగుస్తుంది.

సమాచారం ప్రకారం.. మనోజ్ జరంగే పాటిల్ ఆజాద్ మైదాన్‌కు వెళ్లరు. త్వరలో మైదానాన్ని గుర్తించి విజయోత్సవ వేడుకలు జరుపుకునేందుకు తేదీని ఖరారు చేస్తామని మీడియాకు ఇచ్చిన ప్రకటనలో తెలిపారు. మరాఠా రిజర్వేషన్లు చేస్తున్న మనోజ్ జరంగే పాటిల్ తన డిమాండ్లన్నింటినీ ఆమోదించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి జనవరి 27న 11 గంటల వరకు అల్టిమేటం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈమేరకు శుక్రవారం ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రిజర్వేషన్లకు సంబంధించిన డిమాండ్లను ఆమోదించారు. సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రతినిధి బృందం ఆర్డినెన్స్‌తో మనోజ్ జరంగే పాటిల్‌ను కలిసేందుకు వెళ్లింది.

Also Read: Auto Drivers : ఆ ప‌థ‌కం తరువాత తెలంగాణ‌లో పెరిగిన ఆటో డ్రైవ‌ర్ల ఆత్మ‌హ‌త్య‌లు.. నివేదిక‌లో పేర్కోన్న న్యూస్‌టాప్‌

అంత‌కుముందు.. మరాఠా కోటాపై మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యమ నేత మనోజ్‌ జరంగే అల్టిమేటం విధించారు. శుక్రవారం రాత్రి రిజర్వేషన్లపై మహారాష్ట్ర సర్కార్‌ ఆర్డినెన్స్ జారీ చేయకుంటే శనివారం మధ్యాహ్నం మద్దతుదారులతో పెద్దఎత్తున ముంబైలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రిజర్వేషన్లు సాధించేవరకు వెనకడుగు వేయబోమని ప్రకటించారు. కాగా.. ఆయ‌న డిమాండ్లకు సర్కార్ ఓకే చెప్పిందని విద్యాశాఖ మంత్రి దీపక్ కేసర్కర్ తెలిపారు.

జరంగే- ప్రభుత్వం మధ్య ఒప్పందాలివే

– మరాఠా కమ్యూనిటీకి చెందిన 54 లక్షల మందికి వారి కుంబీ రికార్డుల ప్రకారం కుల ధృవీకరణ పత్రాలు పంపిణీ చేయబడతాయి.
– 54 లక్షల రికార్డుల ప్రకారం వంశపారంపర్యంగా సరిపోలిన తర్వాత ఈ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు.
– 37 లక్షల మందికి సర్టిఫికెట్లు అందజేశారు. మరికొద్ది రోజుల్లో మరాఠా నిరసనకారుల సమాచారాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని, ఆ తర్వాత వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తామన్నారు.
– షిండే కమిటీ రద్దు చేయబడదు. మరాఠాల కుంబీ రికార్డుల కోసం కమిటీ అన్వేషణ కొనసాగిస్తుంది. కమిటీ గడువును ప్రభుత్వం రెండు నెలలు పొడిగించింది.
– నమోదు చేసుకున్న వారి కుటుంబ సభ్యులకు సర్టిఫికెట్లు అందజేస్తారు.
– మరాఠా ఉద్యమం సందర్భంగా అంతర్వాలి సహా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులను నిర్దేశించిన విధానం ప్రకారం ఉపసంహరించుకుంటారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 27 Jan 2024, 09:37 AM IST