Ticket Price: జగన్ ‘సర్కారు’ గుడ్ న్యూస్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Written By:
  • Updated On - May 7, 2022 / 03:27 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ స్టోరీ బేస్డ్ మూవీస్ కావడంతో ప్రేక్షకులు ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల విషయమై ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొంత వెసులుబాటు ఇస్తున్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాత‌లు ఏపీ ప్ర‌భుత్వాన్ని క‌లిసి త‌మ బ‌డ్జెట్‌ను చూపి సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు కోరుతుండటంతో, స‌ర్కారువారి పాట సినిమా యూనిట్ కూడా ఏపీ ప్ర‌భుత్వాన్ని టికెట్ల రేట్ల పెంపున‌కు అభ్య‌ర్థించింది.

ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఏపీ స‌ర్కారు… స‌ర్కారువారి పాట సినిమా టికెట్ల రేట్ల పెంపున‌కు అనుమ‌తి మంజూరు చేసింది. ఈ నెల 12న విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్ల‌పై రూ.45 మేర‌ పెంచుకోవ‌చ్చంటూ ఏపీ ప్ర‌భుత్వం అనుమ‌తి మంజూరు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం రాత్రి ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 12న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రత్యేక అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన సర్కారు వారి ట్రైలర్ మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. ఆ సినిమాలో మహేశ్ బాబు ఏపీ సీఎం జగన్ కు సంబంధించిన డైలాగ్ ఒకటి చెప్పడంతో వైసీపీ నాయకులు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ పై సానుకూలత కారణంగా ఏపీ గవర్నమెంట్ టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.