Maharastra woman: ఆర్టీసీ బస్సులో మగబిడ్డ ప్రసవం.. జీవితకాలం ఉచిత ప్రయాణం

ఆదివారం మహారాష్ట్రలోని ఉట్నూర్‌ నుంచి చంద్రాపూర్‌ వెళ్తున్న టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.

  • Written By:
  • Updated On - June 27, 2022 / 01:56 PM IST

ఆదివారం మహారాష్ట్రలోని ఉట్నూర్‌ నుంచి చంద్రాపూర్‌ వెళ్తున్న టీఎస్‌ఆర్‌టీసీ బస్సులో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. పొరుగు రాష్ట్రం నాందేడ్ జిల్లాకు చెందిన రత్నమల్ల ఆమె ప్రయాణిస్తున్న పల్లె వెలుగు బస్సు గుడిహత్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామం సమీపంలోకి రాగానే పాపకు జన్మనిచ్చింది. బస్సు డ్రైవర్ ఎం అంజన్న, కండక్టర్ సీహెచ్ గబ్బర్ సింగ్ ఇతర మహిళా ప్రయాణికుల సహాయంతో తల్లి, బిడ్డను గుడితనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆదిలాబాద్‌ డీఎం విజయ్‌కుమార్‌, డీవీఎం మధుసూధన్‌ ఆస్పత్రికి చేరుకుని మహిళ, పాప ఆరోగ్యంపై ఆరా తీశారు. TSRTC నిబంధనల ప్రకారం.. నవజాత శిశువుకు జీవితకాలం ఉచిత రవాణా సౌకర్యం అందించబడుతుంది.